crime news: ముంబయిలో నడిరోడ్డుపై కొరియన్ యూట్యూబర్తో అసభ్య ప్రవర్తన..!
ముంబయిలో నడిరోడ్డుపై ఓ మహిళా యూట్యూబర్ వేధింపులకు గురయ్యారు. దీంతో ముంబయి పోలీసులు రంగంలోకి దిగారు.
ఇంటర్నెట్డెస్క్: దక్షిణ కొరియాకు చెందిన ఓ యూట్యూబర్ ముంబయిలోని ఓ వీధిలో బహిరంగంగానే వేధింపులకు గురైంది. లైవ్స్ట్రీమింగ్ చేస్తుండగా ఓ ఆకతాయి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
మయోచి అనే యూట్యూబర్ మంగళవారం రాత్రి ముంబయిలోని రద్దీగా ఉన్న ఓ వీధిలో లైవ్స్ట్రీమ్ చేస్తోంది. ఆ సమయంలో అక్కడ వందల మంది తిరుగుతున్నారు. అప్పుడు ఇద్దరు యువకులు బైక్పై అక్కడకు వచ్చి లిఫ్ట్ ఇస్తామంటూ ఆమె చెయ్యి పట్టుకొని బలవంతంగా లాగారు. ఆమెకు ఏమి చేయాలో అర్థం కాక ‘ఇంటికి వెళ్లాలని’ వారిని వారిస్తూ వెళ్లిపోబోయింది. అంతలో ఓ యువకుడు ఆమెని ముద్దుపెట్టుకోబోయాడు. అతడిని వదిలించుకొని మయోచి ముందుకు వెళ్లిపోయింది. అప్పటికీ ఆ యువకులు ఆమెను వదల్లేదు. ఓ స్కూటర్పై ఆమె వెనుకే వచ్చి మళ్లీ వాహనం ఎక్కాలంటూ బలవంతం చేశారు. కానీ, ఆమె నిరాకరించింది.
ఈ వీడియోను ఆదిత్య అనే వ్యక్తి ట్వీట్ చేశారు. దీనిని మయోచి రీట్వీట్ చేస్తూ.. ‘‘అక్కడ ఓ యువకుడు నన్ను వేధించాడు. విషయం పెద్దది కాకముందే అక్కడి నుంచి వచ్చేశాను. ఎందుకంటే వారు ఇద్దరు ఉన్నారు. నేను స్నేహపూర్వకంగా సంభాషించడం వల్లే ఇలా జరిగిందని కొందరు అంటున్నారు. ఈ ఘటనతో ఇక, నేను వీధుల్లో లైవ్స్ట్రీమ్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలేమో’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. దీనికి ముంబయి పోలీసులు ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘మీరు చెప్పిన దానిని పరిశీలిస్తాం. మీరు నేరుగా మాకు సమాచారం పంపండి’’ అని ట్వీట్ చేశారు. దీనికి మయోచి స్పందిస్తూ.. ‘‘మీకు మెసేజ్ చేసే మార్గం నాకు కనిపించలేదు. మీరు నేరుగా మెసేజ్ చేయండి. దాని ఆధారంగా మీకు అవసరమైన సమాచారం ఇవ్వగలను’’ అని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం