KVP: కాంగ్రెస్‌ నేత కేవీపీ సతీమణి డైమండ్‌ నెక్లస్‌ చోరీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది

Updated : 15 Dec 2022 16:19 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. రూ.46లక్షల విలువైన డైమండ్‌ నెక్లస్‌ కనిపించడం లేదంటూ బంజారాహిల్స్‌ పోలీసులకు ఆయన సతీమణి సునీత రెండురోజుల క్రితం పిర్యాదు చేశారు. ఈనెల 11న సునీత డైమండ్‌ నెక్లస్‌ ధరించి ఫంక్షన్‌ వెళ్లారు. ఫంక్షన్‌ నుంచి ఇంటికి వెళ్లిన కాసేపటి తర్వాత నుంచి నెక్లస్‌ కనిపించడం లేదంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోని పనిమనుషులపై సునీత అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని