Ragging: ర్యాగింగ్పై సినీఫక్కీలో ‘పోలీస్ పంచ్’.. వైద్య విద్యార్థిని వేషంలో లేడీ కాప్!
గుర్తుతెలియని ర్యాగింగ్ కేసును పోలీసులు పక్కా స్కెచ్తో ఛేదించారు. మారువేషాల్లో కళాశాలలోకి ప్రవేశించి ఆకతాయిల పని ఎలా పట్టారో చదవండి.
ఇండోర్: ఓ వైద్య కళాశాలలో ర్యాగింగ్(Ragging) కేసును పోలీసులు సినీఫక్కీలో ఛేదించారు. మారువేషాల్లో కాలేజీలోకి ప్రవేశించిన ఖాకీలు ర్యాగింగ్ చేస్తున్న ఆకతాయిల పనిపట్టారు. సినిమా సన్నివేశాన్ని తలపించే ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ వైద్య కళాశాల(Medical College)లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్పై ఓ విద్యార్థి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కళాశాల అధికారులు కూడా జులై 24న కొందరు గుర్తు తెలియని విద్యార్థులపై క్రిమినల్ కేసు పెట్టారు. యూజీసీ హెల్ప్లైన్(UGC Helpline)కు చేసిన ఫిర్యాదులో ర్యాగింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పేర్కొన్నప్పటికీ.. నిందితులు, ఫిర్యాదుదారు పేర్లులేవని సన్యోగితాగంజ్ పోలీస్స్టేషన్ ఇన్ఛార్జి తెహ్జీబ్ కాజీ తెలిపారు. అలాగే, ఈ ఫిర్యాదుకు సంబంధించిన స్క్రీన్షాట్లు సామాజిక మాధ్యమాల్లో(Social Media) చాటింగ్లో ఉన్నా.. ఎంతమంది విద్యార్థులకు సంబంధించిన సమాచారం లేదని వివరించారు. దీంతో ఈ కేసును ఛేదించేందుకు పోలీసు బృందాన్ని రంగంలోకి దించినట్టు ఆయన తెలిపారు.
ఇందులో భాగంగా 24ఏళ్ల మహిళా పోలీస్ అధికారిని వైద్య విద్యార్థిని వేషంలో కాలేజీకి పంపించి అసలు అక్కడేం జరుగుతుందో నిఘా వేశారు. ఈ కేసును ఛేదించేందుకు కాలేజీ విద్యార్థినిగా ఒకరు, నర్సుగా మరొక పోలీస్ను పంపారు. వీరితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను కాలేజీ క్యాంటీన్ వర్కర్లుగా పంపినట్టు తెహ్బీజ్ కాజీ వివరించారు. ఈ పోలీస్ బృందం కాలేజీలో ర్యాగింగ్ భూతాన్ని ధ్రువీకరించేలా సమగ్ర దర్యాప్తుతో పాటు ఇందులో ప్రమేయం ఉన్న 11మంది విద్యార్థులను గుర్తించింది. సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లను కొన్ని అసభ్యకరమైన చర్యలకు పాల్పడేలా ర్యాగింగ్ చేశారని పోలీసులు తెలిపారు. దీంతో సీఆర్పీసీలో సంబంధిత నిబంధనల ప్రకారం నిందితులకు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. నిందితుల జాబితాను కాలేజీ యంత్రాంగానికి అప్పగించగా.. 11మంది విద్యార్థులపై మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారని తెలిపారు.
హల్ద్వానీ వైద్య కళాశాలలో 44మందిపై కఠిన చర్యలు
ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. డిసెంబర్ 9న జరిగిన ర్యాగింగ్ ఘటనలో 44మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ అరుణ్ జోషి తెలిపారు. ఓ బాధితుడు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిలో ఒక విద్యార్థిని హాస్టల్ నుంచి బహిష్కరించి రూ.50వేలు జరిమానా విధించగా.. మిగతా 43మందికి రూ.25వేలు చొప్పున జరిమానా విధించినట్టు వివరించారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్లు పిలిచి దూషించడం, హాస్టల్ గదికి కూడా పిలించి దాడి చేసినట్టు ఓ వీడియోలో రికార్డయింది. దీనిపై దర్యాప్తు చేసిన యాంటీ ర్యాగింగ్ కమిటీ 44మంది విద్యార్థులను ఈ ఘటనలో దోషులుగా తేల్చింది. కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా వీరిపై చర్యలు తీసుకున్నట్టు ప్రిన్సిపల్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్కు స్వర్ణం, కిశోర్కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి