హైదరాబాద్‌లో 1,050 కిలోల గంజాయి పట్టివేత

నగర శివార్లలో భారీ ఎత్తున గంజాయిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 2.62 కోట్లు విలువ చేసే 1,050 కిలోల గంజాయిని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా హైదరాబాద్‌ నగర శివార్లలో చేపట్టిన తనిఖీల్లో

Published : 16 Aug 2020 00:50 IST

హైదరాబాద్‌: నగర శివార్లలో భారీ ఎత్తున గంజాయిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 2.62 కోట్లు విలువ చేసే 1,050 కిలోల గంజాయిని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా హైదరాబాద్‌ నగర శివార్లలో చేపట్టిన తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ఒక కంటైనర్‌లో ఇతర సరుకుల రవాణా మాటున ప్లాస్టిక్‌ సంచుల్లో గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద వాహనాన్ని సీజ్‌ చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని