‘మదనపల్లె కేసులో అనుమానాలున్నాయ్’
చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో అనుమానాలున్నాయని న్యాయవాది రజిని అభిప్రాయం వ్యక్తం చేశారు. మదనపల్లె సబ్ జైలులో ఉన్న నిందితులను కలిసేందుకు
నిందితులను కలిసేందుకు యత్నించిన న్యాయవాది రజిని
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో అనుమానాలున్నాయని న్యాయవాది రజిని అన్నారు. మదనపల్లె సబ్ జైలులో ఉన్న నిందితులను కలిసేందుకు శనివారం ఆమె ప్రయత్నించారు. అయితే, నిందితులను నేరుగా కలిసేందుకు అధికారులు ఆమెకు అనుమతివ్వలేదు. దీంతో జైలు ద్వారం వద్ద దూరంగా నిలబడి నిందితుల్లో ఒకరైన పురుషోత్తంనాయుడుతో కొన్ని నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం సోమవారం రావాలని చెప్పి జైలు అధికారులు న్యాయవాదిని పంపించేశారు.
అనంతరం రజిని మాట్లాడుతూ.. హైదరాబాద్కు చెందిన న్యాయవాది కృష్ణమాచార్య తరఫున నిందితులను కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. ‘‘నిందితులకు న్యాయసహాయం అవసరమని భావిస్తున్నాం. జంట హత్యల కేసులో అనుమానాలు చాలా ఉన్నాయి. హత్యాస్థలంలోని దృశ్యాలు క్షుద్రపూజలవి కావు. ఈ కేసులో హత్యలకు, నిందితుల ఆధ్యాత్మిక చింతనకు సంబంధం ఉండక పోవచ్చు. రుద్రుడు, క్షుద్రుడు అనే రెండు వేర్వేరు విషయాలను చూపిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ అత్యల్ప ఓటింగ్.. మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?