Tamilnadu: ఇంటర్‌ విద్యార్థితో మహిళా లెక్చరర్‌ పరారీ... ఆపై వివాహం

ఇంటర్ చదువుతున్న విద్యార్థితో ఓ లెక్చరర్‌ పరారై వివాహం చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది.

Published : 26 Mar 2022 02:16 IST

తిరుచ్చి: ఇంటర్ చదువుతున్న విద్యార్థితో ఓ లెక్చరర్‌ పరారై వివాహం చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తురైయూర్  ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కంగారుపడిన యువకుడి తల్లితండ్రులు.. కుమారుడి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు చదువుకుంటున్న కళాశాలలో విచారణ జరపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థిలాగే అదే కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్‌ 26ఏళ్ల షర్మిల కూడా అదృశ్యం కావడాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. షర్మిల సెల్ ఫోన్ సిగ్నల్‌ ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకున్నారు. షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని