Odisha: వేటగాళ్ల ఉచ్చులో చిక్కి చిరుత మృతి

వేటగాళ్ల ఉచ్చులో చిక్కి చిరుత మృతిచెందిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కటక్ జిల్లాలోని అత్‌ఘర్ రేంజ్

Updated : 05 Jan 2022 04:53 IST

కటక్: వేటగాళ్ల ఉచ్చులో చిక్కి చిరుత మృతిచెందిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కటక్ జిల్లాలోని అత్‌ఘర్ రేంజ్ పరిధిలో తిగ్రియా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేటగాళ్లు ఏర్పాటుచేసిన ఉచ్చును గమనించకుండా వెళ్లి.. చిరుత అందులో చిక్కుకుంది. జింకలు, అడవి పందులను చంపేందుకు వేటగాళ్లు.. విద్యుత్ తీగలు, బాంబులను వినియోగిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. వన్యప్రాణుల మీద తరచుగా జరుగుతున్న దాడులపై అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని