Andhra news: వీటీపీఎస్లో తెగిన లిఫ్ట్ వైరు.. ఇద్దరు మృతి
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ థర్మల్ పవర్స్టేషన్లో లిఫ్ట్ వైరు తెగడంతో అది అమాంతం కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరికొంత మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో లిఫ్ట్లో ఎనిమిది మంది ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వీటీపీఎస్ సిబ్బంది, కార్మికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎన్టీపీఎస్లో ఐదో స్టేజి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మెయింటీనెన్స్ కోసం గతంలో ఏర్పాటు చేసిన లిఫ్టులో ఈ రోజు ఉదయం సుమారు 8.45గంటల సమయంలో పరిమితికి మించి కార్మికులు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, లిఫ్టు లోడ్ ఎక్కువై పనిచేయకపోవడంతో కొందరు దిగి పోగా.. ఇద్దరు మాత్రం అందులోనే ఉండిపోయినట్టు పలువురు పేర్కొంటున్నారు. ఆ సమయంలో మళ్లీ లిఫ్టు పైకి వెళ్లే క్రమంలో వైరు తెగిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు ఎన్టీపీఎస్ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు కార్మికుల మృతదేహాలను వీటీపీఎస్ బోర్డు ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ వీటీపీఎస్ యాజమాన్యం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందని.. కార్మికుల భద్రతను గాలికొదిలేస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మృతుల వయస్సు 23-24 ఏళ్ల మధ్యే ఉంటుందని.. వీరంతా ఝర్ఖండ్కు చెందిన వారిగా భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్