Vijayawada-Hyderabad: డివైడర్‌ని ఢీకొని లారీ బోల్తా... 2 కి.మీ. మేర నిలిచిన ట్రాఫిక్‌

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి లారీ బోల్తా పడింది.

Updated : 10 Jun 2023 09:35 IST

నార్కట్‌పల్లి గ్రామీణం: విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి లారీ బోల్తా పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు పార్సిల్‌ లోడుతో వెలుతున్న లారీ నార్కట్‌పల్లి మండలంలోని గోపాలయపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి రహదారిపై అడ్డంగా పడింది. దీంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని