రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

ప్రకాశం జిల్లా పెళ్లూరు సమీపంలో ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.

Published : 20 Mar 2021 01:36 IST

ఒంగోలు క్రైం: రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులోని పెళ్లూరు వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. యువతీ యువకులు ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్నట్లు ప్రాథమిక సమాచారం. 
రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఒంగోలు రైల్వే సీఐ రామారావు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. యువకుడు చీమకుర్తి మండలం గుడివాడ గ్రామానికి చెందిన మద్ది వెంకటసాయి కృష్ణగా గుర్తించారు. యువతి స్వస్థలం చీమకుర్తిగా భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రామారావు తెలిపారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని