Hyderabad: ఫ్రెండ్‌ రూమ్‌కి వెళ్లి.. కేపీహెచ్‌బీలో ప్రేమజంట ఆత్మహత్య

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్నేహితుడి గదిలో శ్యామ్‌ (24), జ్యోతి (22) బలవన్మరణానికి పాల్పడ్డారు.

Updated : 15 May 2023 14:09 IST

హైదరాబాద్‌ (కేపీహెచ్‌బీ): హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్నేహితుడి గదిలో శ్యామ్‌ (24), జ్యోతి (22) బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొల్లవానితిప్పకు చెందిన శ్యామ్‌, అదే గ్రామానికి చెందిన జ్యోతి గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

జ్యోతి గత 20 రోజులుగా కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేటు వసతిగృహంలో ఉంటోంది. శ్యామ్‌ ఇటీవల అదే ప్రాంతంలోని తన స్నేహితుడు కృష్ణ వద్దకు వచ్చాడు. కృష్ణ ఊరికి వెళ్లడంతో శ్యామ్‌ గది తాళాలు అడిగి తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం కృష్ణ రూమ్‌కు శ్యామ్‌, జ్యోతి వచ్చారు. సోమవారం ఉదయం నుంచి దుర్వాసన రావడంతో అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు వచ్చి పరిశీలించగా శ్యామ్‌ ఉరివేసుకుని.. యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. యువతికి గతంలోనే వివాహం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని