మదనపల్లె హత్యలు.. నిందితులకు బెయిల్‌

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. జనవరి 24న మూఢ భక్తితో మదనపల్లెలోని తమ ఇంట్లో కన్న కుమార్తెలు ఇరువురినీ దారుణంగా హతమార్చిన కేసులో అరెస్టు అయిన..

Published : 28 Apr 2021 01:15 IST

చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. జనవరి 24న మూఢ భక్తితో మదనపల్లెలోని తమ ఇంట్లో కన్న కుమార్తెలు ఇరువురినీ దారుణంగా హతమార్చిన కేసులో అరెస్టు అయిన పద్మజ, పురుషోత్తంలకు మదనపల్లె న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న పద్మజ, పురుషోత్తంలకు తొలుత తిరుపతి రుయా ఆస్పత్రిలో.. అనంతరం విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు. అనంతరం వారిని ఇటీవలే మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో నిందితులకు షరతులతో కుడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని