Sai Dharam Tej: ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ బైక్ 75కి.మీ వేగంతో ఉంది: డీసీపీ
సినీనటుడు సాయిధరమ్ తేజ్ నడిపిన ద్విచక్రవాహనం అనిల్ కుమార్ పేరుతో ఉందని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ..
హైదరాబాద్: సినీనటుడు సాయిధరమ్ తేజ్ నడిపిన ద్విచక్రవాహనం అనిల్ కుమార్ పేరుతో ఉందని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సాయితేజ్ ప్రమాద ఘటనపై డీసీపీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎల్బీనగర్కు చెందిన అనిల్ నుంచి ట్రంప్ బైక్ను సాయితేజ్ కొనుగోలు చేశారు. వాహనం మాత్రం ఇంకా అనిల్ పేరు మీదే ఉంది. సాయితేజ్ పేరు మీద మార్చుకోలేదు. గతేడాది ఆగస్టు 2న అతివేగంగా వెళ్లినందుకు ట్రంప్ బైక్పై 1,135 రూపాయల జరిమానా పడింది. ఈరోజు ఆ చలానా డబ్బులను ఎవరో చెల్లించారు. అతివేగం, నిర్లక్ష్యంగా బైక్ నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుంది. సాయితేజ్కు కారు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ద్విచక్రవాహనాలు నడిపేందుకు లైసెన్స్ ఉందా? లేదా? అనే వివరాలు సేకరిస్తున్నాం. సాయితేజ్ ప్రమాదానికి గురైన రహదారిపై 30 కి.మీ పరిమిత వేగంతో వెళ్లాలి. కానీ, తీగల వంతెనపై సాయితేజ్ బైక్ 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 75 కి.మీ వేగంతో ఉంది. దుర్గం చెరువు తీగల వంతెన నుంచి ఐకియా మీదుగా గచ్చిబౌలి వెళ్లే దారిలో వేగ పరిమితికి సంబంధించి తగిన బోర్డులు ఏర్పాటు చేశాం. మాదాపూర్ జోన్ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మాదాపూర్ జోన్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 17,917 ద్విచక్రవాహనాలపై పరిమితికి మించి వేగంతో వెళ్లినందుకు జరిమానా విధించాం. 5,495 మంది ద్విచక్ర వాహనదారులపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశాం’’ అని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత