Maharashtra: తల్లిసాయంతో సోదరిని నరికి... సెల్ఫీలు దిగి..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణ రీతిలో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో ఓ యువతిని ఆమె మైనర్ సోదరుడే.. తల్లి సాయంతో నరికి చంపాడు. అంతటితో ఆగకుండా మొండెం నుంచి ఆమె తలను వేరు చేసి, ఇరుగుపొరుగువారికి ప్రదర్శించడం గమనార్హం...
ముంబయి: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో ఓ యువతిని ఆమె మైనర్ సోదరుడే.. తల్లి సాయంతో నరికి చంపాడు. అంతటితో ఆగకుండా మొండెం నుంచి ఆమె తలను వేరు చేసి, ఇరుగుపొరుగువారికి ప్రదర్శించడం గమనార్హం. మృతురాలు ప్రస్తుతం గర్భిణి కావడం విషాదకరం.
చాయ్ చేస్తుండగా దాడి..
ఈ ఏడాది జూన్లో ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి(19).. భర్తతో కలిసి వైజాపుర్లోని అత్తింటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో గత వారం.. యువతి తల్లి ఆమె ఇంటికి వెళ్లి, పుట్టింటికి రమ్మని కోరింది. ఆదివారం కుమారుడితో కలిసి మరోసారి అక్కడికి వచ్చింది. వారి కోసం ఆమె వంటింట్లో చాయ్ చేస్తుండగా.. అంతలోనే సోదరుడు వెనుక నుంచి కొడవలితో ఒక్కసారిగా దాడి చేశాడు. తల్లి ఆమె కాళ్లు పట్టుకోగా.. అతను నరికి చంపాడు. అనంతరం తలను వేరు చేసి.. చుట్టుపక్కలున్న వారికి చూపెట్టేందుకు బయటకొచ్చాడు.
భర్తపైనా హత్యాయత్నం..
అప్పటికే అనారోగ్యంతో ఉన్న యువతి భర్త.. వేరే గదిలో నిద్రపోతున్నాడు. వంట గదిలో గిన్నెలు పడిపోతున్న శబ్దం విని, ఏం జరుగుతోందో చూసేందుకు వచ్చాడు. దీంతో ఆ బాలుడు అతనిపై కూడా దాడికి యత్నించాడు. కానీ, అతను త్రుటిలో తప్పించుకున్నాడు. అనంతరం నిందితుడు నేరుగా స్టేషన్కు వచ్చి లొంగిపోయినట్లు వీర్గాం పోలీసులు తెలిపారు. అంతకుముందు నరికిన తలతో బాలుడు, అతని తల్లి సెల్ఫీలు దిగినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.