Maharashtra: గుప్తనిధుల కోసం.. 18 ఏళ్ల కుమార్తెను బలిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

గుప్త నిధుల కోసం 18 ఏళ్ల కుమార్తెనే బలిచ్చేందుకు సిద్ధమయ్యాడో తండ్రి. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను రక్షించి.. తండ్రి, తాంత్రికుడితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్​ చేశారు.......

Published : 28 Apr 2022 01:39 IST

ముంబయి: గుప్త నిధుల వేటలో కొందరు విచక్షణ కోల్పోతున్నారు. మనుషులను బలిస్తే ఎన్నడూ చూడనంత సంపద లభిస్తుందనే కట్టుకథలను నమ్మి సొంత వారిని సైతం బలిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని యావత్మాల్​ జిల్లాలో వెలుగు చూసింది. గుప్త నిధుల కోసం 18 ఏళ్ల కుమార్తెనే బలిచ్చేందుకు సిద్ధమయ్యాడో తండ్రి. బాలిక సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాలిక తండ్రి, తాంత్రికుడితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్​ చేశారు.

బాబుల్గావూన్​ తహసీల్​లోని మద్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు బంధువుల ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటోంది. ఇటీవలే తన సొంత ఊరికి వచ్చింది. ఈ క్రమంలో తండ్రి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఓ తాంత్రికుడితో కలిసి ఇంట్లో క్షుద్ర పూజలు చేయటం ప్రారంభించాడు. కుమార్తెను సజీవంగా ఖననం చేసేందుకు ఏప్రిల్​ 25న ఇంట్లోనే పెద్ద గొయ్యి కూడా తవ్వాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక ఎలాగోలా తన స్నేహితురాలికి సమాచారం చేరవేసింది. విషయాన్ని స్నేహితురాలు పోలీసులకు తెలియజేసింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను రక్షించారు. క్షుద్ర పూజలు చేస్తున్న బాలిక తండ్రితోపాటు, తాంత్రికుడు, మరో ఏడుగురిని అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని