Crime News: మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో వీడని చిక్కుముడి
ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ను హ్యాక్ చేసిన కేసులో చిక్కుముడి వీడలేదు. ఇప్పటి వరకు ఆధారాలు లభించకపోవడంతో
హైదరాబాద్: ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ను హ్యాక్ చేసిన కేసులో చిక్కుముడి వీడలేదు. ఇప్పటి వరకు ఆధారాలు లభించకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ హ్యాకింగ్ కేసు సవాలుగా మారింది. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన మూడు ఖాతాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకింగ్ రంగానికి హ్యాకింగ్ వల్ల ముప్పు ఉండటంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా మహేశ్ బ్యాంక్ ఘటనపై దృష్టిసారించాయి. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నుంచి కేంద్ర సైబర్ సెక్యూరిటీ విభాగం వివరాలు సేకరించింది.
కేంద్ర సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని సమన్వయం చేసుకుంటూ సైబర్ క్రైమ్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ఖాతాలకు నగదు బదిలీ కావడంపై మహేశ్ బ్యాంక్లో నిర్వహణ లోపాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇటీవల గంటల వ్యవధిలోనే సైబర్ కేటుగాళ్ల మహేశ్ బ్యాంకులో రూ.12.9 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం