Andhra News: పెళ్లి బస్సు బోల్తా.. 40 మందికి గాయాలు

చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద పెళ్లి బస్సు లోయలో బోల్తా పడింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి నిశ్చితార్థానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది...

Updated : 26 Mar 2022 23:48 IST

భాకరాపేట: చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద పెళ్లి బస్సు లోయలో బోల్తా పడింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి నిశ్చితార్థానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నారు. వీరిలో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. బస్సు సుమారు 100 అడుగుల లోయలో పడిపోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిలో చీకటిగా ఉండటంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని