Crime News: ప్రియురాలికి కానుకలు ఇచ్చేందుకు.. దొంగలుగా మారిన వైద్య విద్యార్థులు

వైద్య వృత్తి చేపట్టి రోగుల ప్రాణాలను కాపాడాల్సినవారు చోరీలకు అలవాటు పడ్డారు. ప్రియురాలికి కానుకలు ఇచ్చేందుకు నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు.

Published : 16 Dec 2021 01:10 IST

పుణె: వైద్య వృత్తి చేపట్టి రోగుల ప్రాణాలను కాపాడాల్సిన వారు చోరీలకు అలవాటు పడ్డారు. ప్రియురాలికి కానుకలు ఇచ్చేందుకు నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. పుణెలోని కొత్‌రుడ్ ప్రాంతంలోని నగల దుకాణంలో ఇద్దరు యువకులు ఉంగరాలు కొట్టేశారు. ఒక యువకుడు వినియోగదారుడిలా వచ్చి.. వ్యాపారిని ఏమార్చి ఉంగరాలతో ఉడాయించాడు. పారిపోవడానికి వీలుగా షాప్ బయట మరొక యువకుడు బైక్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఈ ఘటనపై నగల వ్యాపారి ఫిర్యాదు మేరకు.. సీసీటీవీ ఆధారాలతో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.2.5 లక్షల విలువైన ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వైద్య విద్యార్థులు అంకిత్ హనుమంత్ రొకాడే, వైభవ్ సంజయ్ జగ్‌తాప్‌గా పోలీసులు గుర్తించారు. ప్రేయసికి కానుకలు ఇవ్వడానికే ఉంగరాలను దోచుకెళ్లినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని