Dewas: చేతులు నరికేసి.. ఉరేసి.. సొంత కుమారుడి పాశవిక హత్య!

ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉండగా చూసిన తన కుమారుడి(15)ని ఓ తండ్రి పాశవికంగా హతమార్చాడు. తొలుత అతని చేతులు నరికేసి, ఆపై ఉరేసి చంపేశాడు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్(Dewas) జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

Published : 11 Dec 2022 01:28 IST

భోపాల్‌: ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉండటాన్ని తన కుమారుడు(15) చూశాడనే, కారణంతో  ఓ తండ్రి  ఆ బాలుడిని పాశవికంగా హతమార్చాడు. తొలుత అతని చేతులు నరికేసి, ఆపై ఉరేసి చంపేశాడు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్(Dewas) జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి బాన్‌గర్డాకి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, సమీప బంధువైన ఓ మహిళ(35)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉన్న సమయంలో.. అతని కుమారుడు చూశాడు. దీంతో ఎక్కడ తమ విషయం బయటపడుతుందోనని భావించిన తండ్రి.. సొంత కుమారుడినే అంతమొందించాలనుకున్నాడు.

తొలుత బాలుడి చేతులు నరికేసి, ఆపై.. ఉరేసి హతమార్చాడు. నరికేసిన చేతులను 400 అడుగుల లోతైన బోరుబావిలోకి విసిరేశాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సమీపంలోని పొదల్లో పడేశాడు. బాలుడి మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుడి తండ్రిని సుదీర్ఘంగా విచారించారు. కుమారుడి అదృశ్యంపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అతను అసలు విషయం బయటపెట్టినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని