Cheating: ఘరానా మోసం.. వజ్రాల స్థానంలో గుట్కా ప్యాకెట్లు పెట్టి!
డైమండ్ల (Diamond) స్థానంలో గుట్కా ప్యాకెట్లను పెట్టి.. ఓ వ్యక్తి వజ్రాల వ్యాపారిని మోసం చేశాడు. ఈ ఘటన గుజరాత్లోని సూరత్లో జరిగింది.
సూరత్: గుజరాత్ (Gujarat)లో ఘరానా మోసం జరిగింది. వ్యాపారి దగ్గర వజ్రాలు కొనుగోలు చేసిన వ్యక్తి డీల్ కుదరక పోవడంతో తిరిగి ఇచ్చేశాడు. అయితే, వజ్రాల స్థానంలో గుట్కా ప్యాకెట్లను పెట్టి ఇవ్వడంతో వ్యాపారి కంగుతిన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన గుజరాత్లోని సూరత్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రుషభ్ ఓరా అనే వ్యక్తి వజ్రాల వ్యాపారం చేస్తుండగా.. రహీల్ మంజని వజ్రాల బ్రోకర్గా పని చేస్తున్నాడు. ఓరా నుంచి దాదాపు రూ.32.04 లక్షల విలువైన వజ్రాలను కొనుగోలు చేసి, వాటిని వేరే వ్యాపారికి విక్రయించిన పిదప నగదు చెల్లించేందుకు వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్గా రూ.2 లక్షలు చెల్లించి.. మూడు చిన్న చిన్న పార్సిల్స్లో రహీల్ వజ్రాలను తీసుకెళ్లాడు. మూడు నాలుగు రోజుల్లో మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించాడు.
అయితే, గడువు ముగిసినప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో ఓరా అతడిని నిలదీశాడు. డబ్బులు చెల్లించే ఉద్దేశం లేకపోతే.. వజ్రాలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో రహీల్ ఆ పార్సిల్స్ను తీసుకొని ఓరా ఆఫీసుకు వచ్చాడు. రహీల్ ఎదుటే పార్సిల్స్ను తెరచి చూస్తే.. అందులో గుట్కా ప్యాకెట్లు, పొగాకు ముక్కలు ఉన్నాయి. దీంతో షాక్తిన్న ఓరా.. వెంటనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేరే వ్యాపారికి విక్రయించి..డబ్బులు చెల్లిస్తానని నమ్మించి రహీల్ తనను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రహీల్ను అరెస్టు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!