Karnataka: తండ్రిని హత్యచేసి.. 32 ముక్కలుగా నరికి!

నిత్యం తాగుతూ తనను దుర్భాషలాడుతోన్నాడన్న ఆగ్రహంతో ఓ యువకుడు తన తండ్రిని హతమార్చాడు. ఆపై మృతదేహాన్ని 32 ముక్కలుగా నరికి, బోరుబావిలో పారేశాడు.

Published : 13 Dec 2022 18:26 IST

బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో దారుణం వెలుగుచూసింది. దిల్లీలో శ్రద్ధా వాకర్‌ ఘటన తరహాలో ఇక్కడి బాగల్‌కోట్(Bagalkot)లో ఓ యువకుడు.. తన తండ్రిని హత్య చేసి, మృతదేహాన్ని 32 ముక్కలుగా నరికాడు. అనంతరం.. వాటిని ఓ బోరు బావిలో పారేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా విఠల(20) అనే యువకుడు తన తండ్రి పరశురామ్‌(53)తో కలిసి ఉండేవాడు. అతడి తల్లి, సోదరుడు వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే.. పరశురామ్‌ రోజూ మద్యం తాగి వచ్చి.. విఠలను దుర్భాషలాడేవాడు.

ఈ క్రమంలోనే డిసెంబరు 6న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వేధింపులు తాళలేక కుమారుడు ఆగ్రహంతో ఇనుప రాడ్డుతో తండ్రిపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని 32 ముక్కలుగా నరికి.. సొంత పొలంలోని బోరు బావిలో పారేశాడు. పరశురామ్‌ అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఈ మేరకు దర్యాప్తు చేపట్టగా, అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మృతుడి శరీర భాగాలను జేసీబీ సాయంతో వెలికితీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని