Video: ట్రాలీబ్యాగ్లో రూ.64లక్షల విలువైన విదేశీ కరెన్సీ తరలింపు.. ఎలా బయటకు లాగారో చూడండి!
దిల్లీ నుంచి బ్యాంకాక్కు వెళ్తున్న ఓ వ్యక్తి ట్రాలీ బ్యాగులో విదేశీ కరెన్సీ దాచినట్టు గుర్తించిన సీఐఎస్ఎఫ్ అధికారులు షాక్ అయ్యారు. అతడి బ్యాగుకు ఉన్న ఇనుప చువ్వల్లో దాచిపెట్టిన ఈ నోట్ల కట్టలను పుట్టలోంచి పాముల్ని లాగినట్టుగా బయటకు తీశారు.
దిల్లీ: విదేశీ డబ్బు (foreign currency), బంగారాన్ని(Gold) తరలించేందుకు స్మగ్లర్లు ఎవరి ఊహలకూ అందని రీతిలో సరికొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి పుస్తకాల పేజీల మధ్య కరెన్సీ నోట్ల (90వేల విలువైన డాలర్లు)ను అతికించగా.. మరో వ్యక్తి బంగారాన్ని పేస్ట్ రూపంలో తరలిస్తూ ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. తాజాగా దిల్లీలో అదే తరహా ఘటన వెలుగుచూసింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్కు బయల్దేరిన ఓ వ్యక్తి ట్రాలీ బ్యాగులోని మెటల్ పైపుల్లో రూ.64లక్షల విలువైన విదేశీ కరెన్సీని దాచినట్టు గుర్తించిన అధికారులు అవాక్కయ్యారు. అతడి బ్యాగును క్షుణ్నంగా తనిఖీ చేయగా కరెన్సీ నోట్లను ప్లాస్టిక్ కవర్లో చుట్టి బ్యాగ్ హ్యాండిల్ పైపుల్లో కుక్కినట్టు గుర్తించారు. వాటిని బయటకు లాగగా.. 68,400 యూరోలు; 5000 న్యూజిలాండ్ డాలర్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ వీడియోను తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఇలా వెలుగులోకి..
శనివారం అర్ధరాత్రి 1.15గంటల సమయంలో సురీందర్ సింగ్ రిహాల్ అనే వ్యక్తి అనుమానాస్పద ప్రవర్తనను సీఐఎస్ఎఫ్(CISF) అధికారులు గుర్తించారు. అతడు థాయ్ ఎయిర్లైన్స్ విమానంలో బ్యాంకాక్కు ప్రయాణించాల్సి ఉంది. దీంతో ఆ వ్యక్తిని ర్యాండమ్ చెకింగ్కు తరలించిన సీఐఎస్ఎప్ సిబ్బంది.. ఫిజికల్, ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ చేశారు. అతడి డాక్యుమెంట్లలో సమస్య ఉన్నందున సీఐఎస్ఎప్ అధికారులు ఇంటర్నేషనల్ డిపాచర్ కస్టమ్స్ కార్యాలయానికి అతడిని తరలించి క్షుణ్నంగా తనిఖీ చేయగా విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయని సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో కరెన్సీ తరలించడానికి అవసరమైన పత్రాలు అతడి వద్ద ఏమీ లేవని పేర్కొన్నారు. అతడి నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యల కోసం నిందితుడిని కస్టమ్స్ అధికారులకుఅప్పగించినట్టు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి
వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్లో సోమవారం ఆయనపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. -
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
వంట చేయడంలో ఆలస్యం అయిందని ఓ వ్యక్తి భార్యను పదునైన ఆయుధంతో చంపేశాడు. అనంతరం భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. -
కోల్కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్రావు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్లో 9 మంది మృతి
బిహార్లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్