షాకింగ్‌.. వీడియో కాల్‌ మాట్లాడుతూ నదిలోకి దూకేశాడు!

29 ఏళ్ల యువకుడు వీడియో కాల్‌ మాట్లాడుతుండగానే వంతెన పైనుంచి నదిలోకి దూకేశాడు. జల్పాయిగురి జిల్లాలోని....

Published : 07 Dec 2021 02:19 IST

కోల్‌కతా: బెంగాల్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల యువకుడు వీడియో కాల్‌ మాట్లాడుతుండగానే వంతెన పైనుంచి నదిలోకి దూకేశాడు. జల్పాయిగుడి జిల్లాలోని రాణినగర్‌ బీఎస్‌ఎఫ్‌ క్యాంపు ప్రాంతం పరిధిలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. తీస్తా నదిలో దూకేసిన ఆ యువకుడిని ధీరజ్‌ ప్రజాపతిగా గుర్తించారు. యువకుడి ఆచూకీ ఇంకా తెలియలేదన్నారు. గర్ల్‌ఫ్రెండ్‌తో వాగ్వాదం జరగడం వల్లే ఆకస్మికంగా నదిలోకి దూకేశాడని స్థానిక వ్యక్తి ఒకరు పేర్కొన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని