ప్రేయసిని చంపి.. గోడలో దాచి..

మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తనతో కలిసి ఉంటున్న ప్రేయసిని హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోని గోడలో దాచిపెట్టాడు. ఈ ఘటన పాల్‌గఢ్‌ జిల్లాలోని వనగామ్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు నేరస్థుడిని అరెస్టు చేసి గోడలో ఉన్న మృతదేహాన్ని

Published : 17 Jan 2021 01:34 IST

ముంబయి: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తనతో కలిసి ఉంటున్న ప్రేయసిని హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోని గోడలో దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన పాల్‌గఢ్‌ జిల్లాలోని వనగామ్‌లో వెలుగులోకి వచ్చింది. నేరస్థుడిని అరెస్టు చేసి గోడలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నిందితుడు గత ఐదేళ్లుగా 32 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే, గత కొన్ని నెలలుగా ఆమె కనిపించకుండా పోయింది. మహిళ కుటుంబసభ్యులు ఆమె గురించి నిందితుడిని ప్రశ్నించగా.. పని నిమిత్తం గుజరాత్‌లోని వాపికి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. కొంతకాలం ఎదురుచూసిన కుటుంబసభ్యులు ఆమె తిరిగి రాకపోవడంతో చివరికి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళతో సహజీవనం చేస్తున్న అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. వివాహం చేసుకోవాలని కోరుతుండటంతో నిందితుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని గోడలో దాచిపెట్టినట్లు నిందితుడు పేర్కొన్నట్లు తెలిపారు. వెలికితీసిన మృతదేహం దాదాపు అస్థిపంజరంగా మారింది. దీన్ని బట్టి గత అక్టోబర్‌ నెలలో ఆమెను హత్య చేసినట్లు భావిస్తున్నారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి..

నగదు కోసం భార్యను హతమార్చాడు!

సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని