Crime News: విశాఖలో మహిళను హత్య చేసిన యువకుడు

విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పరవాడకు చెందిన యువకుడు ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు.

Updated : 20 May 2023 10:38 IST

ఎంవీపీ కాలనీ: విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పరవాడకు చెందిన యువకుడు ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరవాడకు చెందిన యువకుడు గోపాలకృష్ణ, వివాహిత శ్రావణి కలిసి ఇవాళ ఉదయం బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర కోపోద్రికుడైన గోపాలకృష్ణ.. శ్రావణిని గొంతు నులిమి హత్య చేశాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. మృతురాలు జగదాంబ కూడలిలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గోపాలకృష్ణకు హత్య చేయాల్సిన అవసరమేంటి? వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం.. తదితర వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, హత్య అనంతరం గోపాలకృష్ణ గాజువాక పోలీసులు ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని