AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
ఏఐ(AI) ఆధారిత చాట్బాట్ (Chatbot) గ్లోబల్ వార్మింగ్ (Global Warming) గురించి చెప్పిన సమాధానాలతో ఆందోళన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మరోసారి ఏఐ ఆధారిత వ్యవస్థల పనితీరుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్రస్సెల్స్: సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (AI) ఆధారిత చాట్జీపీటీ (ChatGPT) ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు ఏఐ కారణంగా ఉద్యోగాలకు ముప్పు ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా చాట్జీపీటీ తరహా చాట్బాట్ (Chatbot) చెప్పిన సమాధానాలతో ఆందోళన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఏఐ కారణంగా జరిగిన తొలి మరణంగా దీన్ని టెక్ రంగ నిపుణులు భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే...
బెల్జియంకు చెందిన పియర్ (Pierre) అనే వ్యక్తి ఛాయ్ (Chai) అనే ఏఐ ఆధారిత యాప్లో ఉండే ఎలిజా (Eliza) అనే చాట్బాట్తో గత రెండేళ్లుగా చాటింగ్ చేస్తున్నాడు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్స్టోర్లో అందుబాటులో ఉంది. ఇందులో యూజర్లు తమకు నచ్చిన వాయిస్ను ఎంచుకుని చాట్ చేయొచ్చు. అలా పియర్.. మహిళ గొంతుతో స్పందించే ఎలిజాను ఎంచుకున్నాడు. ఈ చాట్బాట్తో రోజులో ఎక్కువ సమయం గడుపుతుండేవాడని పియర్ భార్య క్లెయిర్ (Claire) చెప్పినట్లు బెల్జియం వార్తా సంస్థ పేర్కొంది. చాట్బాట్తో చాటింగ్ చేయడం అతనికి వ్యసనంగా మారడంతో కుటుంబానికి దూరమైనట్లు ఆమె వెల్లడించారు.
పియర్ తరచూ వాతావరణ మార్పులపై చాట్బాట్ను ప్రశ్నిస్తుండేవాడని క్లెయిర్ తెలిపింది. ఈ క్రమంలో గ్లోబల్ వార్మింగ్ (Global Warming) గురించి చాట్బాట్ చెప్పిన సమాధానాలతో ప్లియర్ ఆందోళన చెందేవాడని ఆమె పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు ఎలిజా చాట్బాట్ తీసుకుంటే తాను ఆత్మహత్య చేసుకోవాలనే ప్రతిపాదన చాట్బాట్ ముందుంచాడని క్లెయిర్ తెలిపింది. అయితే, ప్లియర్ ఆత్మహత్య ఆలోచనలను చాట్బాట్ నివారించకపోవడంతో అతను ఆత్మహత్యకు చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై ఛాయ్ సంస్థ స్పందించింది. యూజర్లు ఆత్మహత్య వంటి విషయాల గురించి చర్చించినప్పుడు వారి ఆలోచనలు మార్చే విధంగా సమాధానాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.
కొద్ది రోజుల క్రితం ఏఐతో మానవాళికి ముప్పు ఉందనే వాదనతో ఏకీభవిస్తూ ఆయా వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాలని కోరుతూ టెక్ రంగ నిపుణులు ఓ లేఖను విడుదల చేశారు. ‘పాజ్ జియాంట్ ఏఐ ఎక్స్పెరిమెంట్స్’ పేరిట విడుదల చేసిన ఈ లేఖపై ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ సహా 1,000 మందికి పైగా టెక్ రంగ నిపుణులు, పలు సంస్థల సీఈవోలు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఏఐ చాట్బాట్ కారణంగా వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతున్న ఓ యువతిని నల్గొండ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
బెంగళూరులో పేలుడు పదార్థాలు వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
శంషాబాద్ పరిధిలో నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. -
వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి
వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్లో సోమవారం ఆయనపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. -
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
వంట చేయడంలో ఆలస్యం అయిందని ఓ వ్యక్తి భార్యను పదునైన ఆయుధంతో చంపేశాడు. అనంతరం భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. -
కోల్కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్రావు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్లో 9 మంది మృతి
బిహార్లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్