Suryapet: వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లక్కవరం గ్రామంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది.
హుజూర్నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లక్కవరం గ్రామంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. వివాహేతర సంబంధం విషయంలో సైదులు, మహేశ్ మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలే సైదులు పెద్దమనుషుల ద్వారా చెప్పించినా.. మహేశ్ తీరు మారలేదు. నిన్న రాత్రి బైక్పై వస్తున్న మహేశ్ను గమనించిన సైదులు అతడిని ట్రాక్టర్తో ఢీకొట్టాడు. దీంతో మహేశ్ పక్కనే ఉన్న పొలంలో పడ్డాడు. అనంతరం ట్రాక్టర్తో తొక్కిచడంతో మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి అయినా తన భర్త ఇంటికి రాకపోవడంతో మహేశ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉదయం పొలాలకు వెళ్లే దారిలో మృతదేహం కనిపించడంతో రైతులు.. సర్పంచి, పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
► Read latest Crime News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా