Crime news: ‘నన్ను చంపేయ్.. బతికొచ్చి నీ బాధలు తీరుస్తా’
తాంత్రిక శక్తులతో భవిష్యత్తును మారుస్తానన్న స్నేహితుడి మాట విన్న ఓ వ్యక్తి అతణ్ని హత్య చేసి కటకటాల పాలైన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో చోటుచేసుకుంది.
తాంత్రిక శక్తులతో భవిష్యత్తును మారుస్తానన్న స్నేహితుడి మాట విన్న ఓ వ్యక్తి అతణ్ని హత్య చేసి కటకటాల పాలైన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో చోటుచేసుకుంది. పేద కుటుంబానికి చెందిన నితీశ్ సైనీ తన భవిష్యత్తు గురించి తరచూ ఆందోళన చెందేవాడు. ఈ క్రమంలో 6 నెలల క్రితం హరిద్వార్లోని హర్ కీ పౌఢీకి వెళ్లిన నితీశ్కు.. ఆశిష్ దీక్షిత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తన బాధలన్నింటినీ ఆ వ్యక్తికి చెప్పాడు. తనకున్న తాంత్రిక శక్తులతో కష్టాలన్నీ తీరుస్తానని అతను హామీ ఇచ్చాడు. డిసెంబర్ 8న నితీశ్ సైనీ, ఆశిష్లు ప్రయాగ్రాజ్కు వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత తనని చంపమని నితీశ్ను కోరాడు ఆశిష్. తాను చనిపోయి తిరిగి వస్తానని.. తాంత్రిక శక్తులతో అద్భుతాలు సృష్టిస్తానని చెప్పాడు. ఆ మాటలు విని చంపేందుకు సిద్ధపడ్డ నితీశ్.. ఆశిష్ మెడపై కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నితీశ్ను పొలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM