Crime news: ‘నన్ను చంపేయ్‌.. బతికొచ్చి నీ బాధలు తీరుస్తా’

తాంత్రిక శక్తులతో భవిష్యత్తును మారుస్తానన్న స్నేహితుడి మాట విన్న ఓ వ్యక్తి అతణ్ని హత్య చేసి కటకటాల పాలైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది.

Updated : 18 Dec 2022 07:09 IST

తాంత్రిక శక్తులతో భవిష్యత్తును మారుస్తానన్న స్నేహితుడి మాట విన్న ఓ వ్యక్తి అతణ్ని హత్య చేసి కటకటాల పాలైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. పేద కుటుంబానికి చెందిన నితీశ్‌ సైనీ తన భవిష్యత్తు గురించి తరచూ ఆందోళన చెందేవాడు. ఈ క్రమంలో 6 నెలల క్రితం హరిద్వార్‌లోని హర్‌ కీ పౌఢీకి వెళ్లిన నితీశ్‌కు.. ఆశిష్‌ దీక్షిత్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తన బాధలన్నింటినీ ఆ వ్యక్తికి చెప్పాడు. తనకున్న తాంత్రిక శక్తులతో కష్టాలన్నీ తీరుస్తానని అతను హామీ ఇచ్చాడు.  డిసెంబర్‌ 8న నితీశ్‌ సైనీ, ఆశిష్‌లు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు.  అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత తనని చంపమని నితీశ్‌ను కోరాడు ఆశిష్‌. తాను చనిపోయి తిరిగి వస్తానని.. తాంత్రిక శక్తులతో  అద్భుతాలు సృష్టిస్తానని చెప్పాడు. ఆ మాటలు విని చంపేందుకు సిద్ధపడ్డ నితీశ్‌.. ఆశిష్‌ మెడపై కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.  నితీశ్‌ను పొలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని