Kadapa: ప్రాణం తీసిన పూచీకత్తు.. చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు!
అప్పు పూచీకత్తు వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నెలో చోటుచేసుకుంది. జూన్ 1న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చింతకొమ్మదిన్నె: అప్పు పూచీకత్తు వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నెలో చోటుచేసుకుంది. జూన్ 1న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహితుడు తీసుకున్న రూ.15లక్షల అప్పునకు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి పూచీకత్తుగా ఉన్నారు. అప్పు తీసుకున్న స్నేహితుడు రుణ దాతలకు తిరిగి ఇవ్వలేదు. దీంతో పూచీకత్తుగా ఉన్న శ్రీకాంత్ను అడిగారు. ఈ క్రమంలో ఆయనకు అప్పు ఇచ్చిన వ్యక్తులకు మధ్య వాగ్వాదం జరిగి అది ఘర్షణకు దారి తీసింది.
ఈ ఘర్షణలో శ్రీకాంత్రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. ఆధారాలు లభించకూడదనే ఉద్దేశంతో మృతదేహంపై నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ హత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన మీడియా మొఘల్
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ
-
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!
-
LEO Movie: పోస్టర్లతోనే ‘లియో’ కథను హింట్ ఇచ్చారా? ఆ జాబితాలోనూ నెం.1