Fraud: మంత్రి పదవులు ఇప్పిస్తానంటూ.. ఎమ్మెల్యేలకు గాలం!
మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇప్పిస్తానంటూ ఎమ్మెల్యేలను మోసం చేసేందుకు యత్నించాడో వ్యక్తి. ఓ ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ముంబయి: భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యక్తిగత సహాయకుడినని నమ్మబలుకుతూ.. మంత్రి పదవులు ఇప్పిస్తానని ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు యత్నించాడో వ్యక్తి. చివరకు ఓ ఎమ్మెల్యే ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్ర (Maharashtra)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్కు చెందిన నీరజ్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి తనకు తాను జేపీ నడ్డా వ్యక్తిగత సహాయకుడిగా అవతారమెత్తాడు. మహారాష్ట్రలోని ఏక్నాథ్ శిందే ప్రభుత్వ తదుపరి మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ పదవులు ఇప్పిస్తానంటూ నలుగురు భాజపా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి, రూ.లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా.. సదరు ఎమ్మెల్యేలతో జేపీ నడ్డా మాదిరి గొంతు ఉన్న ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడించడం గమనార్హం.
అతడి తీరుపై అనుమానం వచ్చిన ఎమ్మెల్యే వికాస్ కుంభారే.. తన పీఏ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తనను పలుమార్లు సంప్రదించి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నాగ్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్