Crime News: ట్యాంక్లో నీళ్లు ఖాళీ చేసి.. కొడుకు కుటుంబానికి నిప్పంటించి..
ఆస్తి తగాదాలతో కన్న కొడుకు కుటుంబాన్ని అంతం చేశాడో తండ్రి. కొడుకు ఇంటిపైకి పెట్రోల్ బాటిల్ విసిరి నిప్పంటించాడు. వారు ఎక్కడ బతుకుతారో అని ఇంట్లో ఉన్న ట్యాంక్లో
తిరువనంతపురం: ఆస్తి తగాదాలతో కన్న కొడుకు కుటుంబాన్ని అంతం చేశాడో తండ్రి. కొడుకు ఇంటిపైకి పెట్రోల్ బాటిల్ విసిరి నిప్పంటించాడు. వారు ఎక్కడ బతుకుతారో అని ఇంట్లో ఉన్న ట్యాంక్లో నీళ్లు కూడా ఖాళీ చేశాడు. ఈ అమానుష ఘటన కేరళలోని తొడుపుళలో నిన్న అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తొడుపుళలోని చీనికుళి ప్రాంతానికి చెందిన ఫైజల్ స్థానికంగా కిరాణా దుకాణాన్ని నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన తండ్రి హమీద్ కొన్నేళ్ల కిందట 50 సెంట్ల భూమిని ఫైజల్కు ఇచ్చాడు. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తన భూమి తనకు తిరిగిచ్చేయాలని హమీద్ అడిగాడు. ఇందుకు ఫైజల్ ఒప్పుకోకపోవడంతో వీరి మధ్య తగాదాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే కొడుకుపై కోపం పెంచుకున్న హమీద్.. పక్కా పథకం ప్రకారం తన కొడుకు, కోడలు, ఇద్దరు మనవరాళ్లను అతి దారుణంగా హత్య చేశాడు.
శుక్రవారం అర్ధరాత్రి ఫైజల్ తన భార్యాపిల్లలతో నిద్రిస్తుండగా.. హమీద్ గది బయటి నుంచి గడియపెట్టి రూంపైకి పెట్రోల్ బాటిల్ను విసిరాడు. ఆ తర్వాత నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. అంతకుముందే మంటలు ఆర్పడానికి వీలు లేకుండా ఇంట్లోని నీళ్ల ట్యాంకును ఖాళీ చేశాడు. మంటలు గమనించిన ఫైజల్ కుటుంబం గది నుంచి బయటకు రాలేక తమను తాము రక్షించుకునేందుకు బాత్రూమ్లోకి వెళ్లిపోయింది. అయితే అప్పటికే గది నిండా మంటలు వ్యాపించి నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హమీద్ను అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్