Crime News: టీతో పాటు టిఫిన్ పెట్టలేదని కోడలిపై కాల్పులు..
అదనపు కట్నంకోసమో లేదా మరేదైనా కారణంగానో కోడళ్లని వేధించడం చూస్తుంటాం కానీ థానేలో అల్పాహారం సమయానికి పెట్టనందుకు తన కోడలిని కాల్చాడో వృద్ధుడు.
థానే: అదనపు కట్నం కోసమో లేదా మరేదైనా కారణంగానో కోడళ్లని వేధించడం చూస్తుంటాం. కానీ.. థానేలో సమయానికి అల్పాహారం పెట్టనందుకు తన కోడలిని కాల్చాడో వృద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థానేలో నివాసం ఉంటున్న కాశీనాథ్ పాండురంగ పాటిల్ (76) తన కోడలు టీతో పాటు అల్పాహారం అందించకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. తన వద్ద ఉన్న తుపాకీతో ఆమెను కాల్చాడు. కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. గురువారం ఈ ఘటన చోటుచేసుకోగా.. నిందితుడి మరో కోడలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!