Crime News : కలిసుంటానని చెప్పి.. కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి..

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. ఫ్యామిలీ కోర్టు ఆవరణలోనే.. అందరూ చూస్తుండగానే.. ఓ వ్యక్తి తన భార్య గొంతును పదునైన ఆయుధంతో కోశాడు.

Updated : 14 Aug 2022 16:24 IST

బెంగళూరు : కర్ణాటకలో దారుణం చోటుచేసుకొంది. ఓ ఫ్యామిలీ కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగానే.. ఓ వ్యక్తి తన భార్య గొంతును పదునైన ఆయుధంతో కోశాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. భార్యతో కలిసి ఉంటానని కోర్టుకు చెప్పిన కొన్ని క్షణాల్లోనే.. అతడు ఈ దాడికి పాల్పడటం దారుణం. వివరాల్లోకి వెళ్తే..

హసన్‌ జిల్లాకు చెందిన శివకుమార్‌, చైత్రకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య మనస్పర్థలు రావడంలో ఇటీవల హోలెనరాసిపుర ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకొన్నారు. ఈ క్రమంలో  కౌన్సిలింగ్‌ సెషన్‌కు వీరు హాజరయ్యారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కలిసి ఉంటామని అధికారులకు తెలియజేశారు. అంతలోనే ఏమైందో ఏమో.. శివకుమార్‌ భార్యపై దాడికి పాల్పడ్డాడు. కౌన్సిలింగ్‌ సెషన్‌ అనంతరం చైత్ర వాష్‌రూమ్‌కి వెళ్తుండగా.. భర్త అడ్డుకుని కత్తితో గొంతు కోశాడు. వెంటనే అక్కడున్నవారు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. పారిపోయేందుకు ప్రయత్నించిన శివకుమార్‌ను అక్కడున్నవారు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ‘కౌన్సిలింగ్‌ అనంతరం హత్యకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టాం. కోర్టు ఆవరణలోకి అతడు కత్తిని ఎలా తీసుకువచ్చాడనే విషయంపై కూడా ఆరా తీస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు