Hyderabad: బాలానగర్ ఫ్లైఓవర్ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
మద్యం మత్తులో గతంలో పలుమార్లు చనిపోతానని బెదిరించిన ఓ వ్యక్తి ఈసారి ఎవరికీ చెప్పకుండా మందు కొట్టి నిజంగానే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్: మద్యం మత్తులో గతంలో పలుమార్లు చనిపోతానని బెదిరించిన ఓ వ్యక్తి ఈసారి ఎవరికీ చెప్పకుండా మందు కొట్టి నిజంగానే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలానగర్ సీఐ కె.భాస్కర్ కథనం ప్రకారం.. కోమటిబస్తీకి చెందిన వెల్డింగ్ పని చేసే కొర్రా అశోక్(35) కొన్నేళ్లుగా పని సరిగా చేయకుండా మద్యం తాగి జులాయిగా తిరిగేవాడు. భార్య, సంజీవరెడ్డినగర్లో ఉండే బంధువుల నుంచి డబ్బులు తీసుకొని నిత్యం తాగుతుండేవాడు. డబ్బులు ఇవ్వకపోతే వంతెనపై నుంచి దూకుతానని, ఉరేసుకుంటానని పలుమార్లు బెదిరించాడు. 6 మాసాల క్రితం ఇలాగే తమ్ముడు అభిలాష్కు ఫోన్ చేయడంతో అతను వచ్చి కాపాడాడు. సోమవారం తప్పతాగి ఎవరికీ చెప్పకుండా బాలానగర్ వంతెనపైకెక్కి దూకేశాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి, తర్వాత గాంధీకి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News: ఎన్సీఆర్బీ పేరిట ఫేక్ మెసేజ్.. విద్యార్థి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్లో ఏముంది?
-
Maneka Gandhi: మేనకా గాంధీపై ఇస్కాన్ రూ.వంద కోట్ల పరువు నష్టం దావా
-
Kriti Sanon: సినిమా ప్రచారం కోసం.. రూ. 6 లక్షల ఖరీదైన డ్రెస్సు!
-
Pawan Kalyan: కృష్ణా జిల్లాలో 5రోజుల పాటు పవన్ వారాహి యాత్ర
-
Social Look: లండన్లో అల్లు అర్జున్.. చెమటోడ్చిన ఐశ్వర్య.. సెట్లో రష్మి
-
Britney Spears: కత్తులతో డ్యాన్స్.. పాప్ సింగర్ ఇంటికి పోలీసులు