Hyderabad: బాలానగర్‌ ఫ్లైఓవర్‌ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

మద్యం మత్తులో గతంలో పలుమార్లు చనిపోతానని బెదిరించిన ఓ వ్యక్తి ఈసారి ఎవరికీ చెప్పకుండా మందు కొట్టి నిజంగానే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 06 Jun 2023 13:13 IST

హైదరాబాద్‌: మద్యం మత్తులో గతంలో పలుమార్లు చనిపోతానని బెదిరించిన ఓ వ్యక్తి ఈసారి ఎవరికీ చెప్పకుండా మందు కొట్టి నిజంగానే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలానగర్‌ సీఐ కె.భాస్కర్‌ కథనం ప్రకారం.. కోమటిబస్తీకి చెందిన వెల్డింగ్‌ పని చేసే కొర్రా అశోక్‌(35) కొన్నేళ్లుగా పని సరిగా చేయకుండా మద్యం తాగి జులాయిగా తిరిగేవాడు. భార్య, సంజీవరెడ్డినగర్‌లో ఉండే బంధువుల నుంచి డబ్బులు తీసుకొని నిత్యం తాగుతుండేవాడు. డబ్బులు ఇవ్వకపోతే వంతెనపై నుంచి దూకుతానని, ఉరేసుకుంటానని పలుమార్లు బెదిరించాడు. 6 మాసాల క్రితం ఇలాగే తమ్ముడు అభిలాష్‌కు ఫోన్‌ చేయడంతో అతను వచ్చి కాపాడాడు. సోమవారం తప్పతాగి ఎవరికీ చెప్పకుండా బాలానగర్‌ వంతెనపైకెక్కి దూకేశాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి, తర్వాత గాంధీకి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని