Pushpa: ‘పుష్ప’లా ట్రై చేశాడు.. అడ్డంగా దొరికిపోయాడు!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్గా కనిపించిన విషయం తెలిసిందే. పోలీసుల కంట పడకుండా ఎర్ర చందనాన్ని రాష్ట్రం దాటిస్తుంటాడు. అయితే, నిజజీవితంలోనూ ఓ వ్యక్తి ‘పుష్ప’ను స్ఫూర్తిగా తీసుకొని రూ. కోట్లు విలువ చేసే
ముంబయి: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్గా నటించిన విషయం తెలిసిందే. పోలీసుల కంట పడకుండా ఎర్ర చందనాన్ని రాష్ట్రం దాటిస్తుంటాడు. అయితే, నిజ జీవితంలోనూ ఓ వ్యక్తి ‘పుష్ప’ను స్ఫూర్తిగా తీసుకొని రూ.కోట్లు విలువ చేసే ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ట్రక్కు డ్రైవర్గా పనిచేస్తున్న యాసిన్ ఇనయాతుల్లా.. కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు వెళ్లే క్రమంలో ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. తన ట్రక్కులో మొదట ఎర్ర చందనం దుంగల్ని పెట్టి.. దానిపై పండ్లు, కూరగాయాల డబ్బాలను ఉంచాడు. పైగా ట్రక్కుకు ‘కొవిడ్ - 19, నిత్యావసర ఉత్పత్తులు’ అని స్టిక్కర్ కూడా అతికించాడు. అలా ఆంధ్రప్రదేశ్లోని అన్ని చెక్ పోస్టులను సునాయాసంగా తప్పించుకొని మహారాష్ట్రకు చేరుకున్నాడు. సంగ్లీ జిల్లాలోని గాంధీ చౌక్ వద్దకు రాగానే అక్కడి పోలీసులు ట్రక్కును అడ్డుకొని తనిఖీ చేయగా అసలు బండారం బయటపడింది.
వెంటనే పోలీసులు డ్రైవర్ యాసిన్ను అరెస్ట్ చేసి.. ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.45 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ‘పుష్ప’ చిత్రంలో కథానాయకుడు పోలీసులకు చిక్కకుండా ఎర్ర చందనం దుంగల్ని పాల ట్యాంకర్ అడుగు భాగంలో దాచి.. పైకి పాలు తీసుకెళ్తున్నట్లు నటిస్తాడు. అచ్చం అలాగే యాసిన్ కూడా ట్రక్కు లోపల దుంగల్ని పెట్టి.. పండ్లు, కూరగాయాలు తీసుకెళ్తున్నట్లు నాటకమాడాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు