IndiGo: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి ఆత్మహత్యాయత్నం..
కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకోవాలని ఓ విమాన ప్రయాణికుడు (Flight) ఎమర్జెన్సీ డోర్ను తెరిచాడు. తోటి ప్రయాణికులను భయందోళనకు గురి చేశాడు.
గువహటి: విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. తోటి ప్రయాణికులను భయందోళనకు గురి చేశాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో విమానం గురువారం మధ్యాహ్నం గువహటి (Guwahati) నుంచి అగర్తల (Agartala)కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అందులో ప్రయాణిస్తున్న బిస్వజిత్ దేబత్ (41) ఎమర్జెన్సీ డోర్ను తెరిచేందుకు ప్రయత్నించాడు.
దీంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. విమానం అగర్తల ఎయిర్పోర్టులో ల్యాండ్ కాగానే ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు. పశ్చిమ త్రిపురలోని జిరానియాకు చెందిన దేబత్ కుంగుబాటు కారణంగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించినట్లు విచారణలో తేలింది. ఆత్మహత్యాయత్నాన్ని ప్రయాణికులు అడ్డుకోగా.. వారితో అతడు గొడవ దిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య
ఓ దస్తావేజు లేఖరిని ఇద్దరు దుండగులు ఇంటికి వచ్చి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. -
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య
ఒక పక్క ప్రైవేట్ ఆర్థిక సంస్థ ఒత్తిళ్లు.. మరో పక్క ఇష్టపడిన యువతి నుంచి స్పందన తక్కువగా ఉండటం.. వీటితో మానసిక ఒత్తిడి గురైన ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లారీ దహనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు ఓ లారీని దహనం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి మండలంలోని పూసుగుప్పలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. -
కోటాలో నీట్ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం మరో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
గ్లాస్ డోర్ మీదపడి చిన్నారి మృతి
పంజాబ్లోని లుధియానా షోరూంలో గ్లాస్ డోర్తో ఆడుకొంటున్న మూడేళ్ల చిన్నారికి ఆ తలుపే మృత్యువుగా మారింది. నగరంలోని ఘుమార్ మండీ వస్త్రదుకాణంలో ఈ దుర్ఘటన జరిగింది. -
యూపీలో అపహరణ.. హైదరాబాద్లో అత్యాచారం
ఉత్తర్ప్రదేశ్కు చెందిన 13 ఏళ్ల బాలికను అపహరించిన ఓ వ్యక్తి హైదరాబాద్లో ఆమెపై వారం రోజులపాటు అత్యాచారానికి పాల్పడిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
విశ్రాంత ఉద్యోగి బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.25 కోట్లు మాయం
ఓ విశ్రాంత ఉద్యోగి బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.25 కోట్లు మాయమవ్వడంతో కోరుట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
కాల్పులకు తెగబడిన దుండగులను చీపురు కర్రతోనే తరిమికొట్టిందో మహిళ. హరియాణాలో ఈ ఘటన ఇది వెలుగుచూసింది.


తాజా వార్తలు (Latest News)
-
తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థుల ఘర్షణ.. శిరోముండనం చేయించిన కళాశాల యాజమాన్యం!
-
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు
-
శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్?
-
సాగర సర్పం.. కాటేస్తే కష్టం