వెంచర్కు లంచం.. ఏసీబీ వలలో సర్పంచ్
వెంచర్కు అనుమతి ఇవ్వడానికి రూ.13 లక్షలు లంచం అడిగిన సర్పంచ్ను అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు వల పన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
పూడూరు: వెంచర్కు అనుమతి ఇవ్వడానికి రూ.13 లక్షలు లంచం అడిగిన సర్పంచ్ను అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు వల పన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మహబూబ్ ఆలంఖాన్ అనే వ్యక్తికి 5 ఎకరాల భూమి ఉంది. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న తన స్థలంలో లే అవుట్ వేసేందుకు అనుమతి కోరుతూ మన్నెగూడ గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. వెంచర్కు అనుమతి ఇవ్వాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని సర్పంచ్ వినోద్ గౌడ్ డిమాండ్ చేశాడు. రూ.15 లక్షలు ఇస్తానని ఒప్పుకున్న ఆలంఖాన్ వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. హైదరాబాద్ అప్పా కూడలి వద్ద రూ.13 లక్షల లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలోని బృందం వినోద్ గౌడ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వినోద్గౌడ్ను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఏసీబీ అధికారులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం