ముక్కుపై మాస్కు జారిందని.. చితకబాదారు!

కరోనా వైరస్‌ జాగ్రత్త చర్యల విషయమై మధ్యప్రదేశ్‌ పోలీసులు ఓ వ్యక్తి పట్ల  వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఓ ఆటోడ్రైవర్‌ ముక్కు భాగాన్ని కవర్‌ చేసేలా మాస్కు ధరించనందుకు పోలీసులు అతడిపై కుమారుడి ముందే

Updated : 07 Apr 2021 11:02 IST

భోపాల్‌: కరోనా వైరస్‌ జాగ్రత్తల విషయమై మధ్యప్రదేశ్‌ పోలీసులు ఓ వ్యక్తి పట్ల  వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఓ ఆటోడ్రైవర్‌ ముక్కు భాగాన్ని కవర్‌ చేసేలా మాస్కు ధరించనందుకు పోలీసులు అతడిని కుమారుడి ముందే విచక్షణా రహితంగా చితకబాదారు. ఈ ఘటన ఇండోర్‌లో చోటుచేసుకుంది.

మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ కేయర్‌ అనే వ్యక్తి స్థానిక ఆటో డ్రైవర్. ఇటీవల ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి వద్దకు కుమారుడితో కలిసి ఆటోలో బయలుదేరాడు. ఈ క్రమంలో అతడు ధరించిన మాస్కు ముక్కు భాగాన్ని కవర్‌ చేయలేదని పేర్కొంటూ పోలీసులు ఆయన్ను ఆపారు. కొంతసేపు వాగ్వాదం జరిగిన అనంతరం ఆటోడ్రైవర్‌ను స్టేషన్‌కు రావాలని సూచించారు. ఇందుకు డ్రైవర్‌ నిరాకరించడంతో అతడిని అక్కడే ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఫోన్‌లో చిత్రీకరిస్తున్నారే తప్ప ఎవరూ పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాడికి పాల్పడిన పోలీసులను కమల్‌ ప్రజాపత్‌, ధర్మేంద్ర జాట్‌లుగా గుర్తించారు. కాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో అధికారులు వారిపై చర్యలకు ఉపక్రమించారు. వారిని సస్పెండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని