ముక్కుపై మాస్కు జారిందని.. చితకబాదారు!
కరోనా వైరస్ జాగ్రత్త చర్యల విషయమై మధ్యప్రదేశ్ పోలీసులు ఓ వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఓ ఆటోడ్రైవర్ ముక్కు భాగాన్ని కవర్ చేసేలా మాస్కు ధరించనందుకు పోలీసులు అతడిపై కుమారుడి ముందే
భోపాల్: కరోనా వైరస్ జాగ్రత్తల విషయమై మధ్యప్రదేశ్ పోలీసులు ఓ వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఓ ఆటోడ్రైవర్ ముక్కు భాగాన్ని కవర్ చేసేలా మాస్కు ధరించనందుకు పోలీసులు అతడిని కుమారుడి ముందే విచక్షణా రహితంగా చితకబాదారు. ఈ ఘటన ఇండోర్లో చోటుచేసుకుంది.
మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ కేయర్ అనే వ్యక్తి స్థానిక ఆటో డ్రైవర్. ఇటీవల ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి వద్దకు కుమారుడితో కలిసి ఆటోలో బయలుదేరాడు. ఈ క్రమంలో అతడు ధరించిన మాస్కు ముక్కు భాగాన్ని కవర్ చేయలేదని పేర్కొంటూ పోలీసులు ఆయన్ను ఆపారు. కొంతసేపు వాగ్వాదం జరిగిన అనంతరం ఆటోడ్రైవర్ను స్టేషన్కు రావాలని సూచించారు. ఇందుకు డ్రైవర్ నిరాకరించడంతో అతడిని అక్కడే ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఫోన్లో చిత్రీకరిస్తున్నారే తప్ప ఎవరూ పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాడికి పాల్పడిన పోలీసులను కమల్ ప్రజాపత్, ధర్మేంద్ర జాట్లుగా గుర్తించారు. కాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో అధికారులు వారిపై చర్యలకు ఉపక్రమించారు. వారిని సస్పెండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్