ప్రేయసి కాదందని వైద్య విద్యార్థి ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి కాదందని ఓ వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన

Published : 26 Mar 2021 01:21 IST

సిద్దిపేట టౌన్‌: ప్రేమించిన అమ్మాయి కాదందని ఓ వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచ్యాల మండలం ఆరుట్ల గ్రామ పరిధిలోని పీసీ తండాకు చెందిన విద్యార్థి సంతోష్‌(19) సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం వార్షిక పరీక్షలు రాయాల్సి ఉండగా విద్యార్థి హాజరు కాలేదు. దీంతో కళాశాల అటెండర్ వసతి గృహానికి వెళ్లి చూడగా సంతోష్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహం వద్ద ఉన్న ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమించిన అమ్మాయి తిరస్కరించిన కారణంగా మనస్తాపంతో ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు లేఖలో ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని