మట్టిమిద్దె కూలి ముగ్గురి మృతి
ప్రమాదవశాత్తు మట్టి మిద్దె కూలి తల్లితో సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లా గండేడు మండల పరిధిలోని పగిడ్యాల గ్రామంలో..
గండేడు: ప్రమాదవశాత్తు మట్టి మిద్దె కూలి తల్లితో సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లా గండేడు మండల పరిధిలోని పగిడ్యాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జొన్నల శరణమ్మం(35), పెద్ద కుమార్తె భవాని(13), చిన్న కుమార్తె వైశాలి(9) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వర్షం కురిసింది. వర్షానికి మట్టిమిద్దె తడిసి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లితోపాటు ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అదనపు కలెక్టర్ ఈటా రామారావు, ఎస్పీ రాజేశ్వరి, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ జ్యోతి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం