Anantapur: పసికందును చంపి.. ఉరేసుకొన్న తల్లి

అనంతరపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో దారుణం జరిగింది. ఓ మహిళ తన 3 నెలల కుమార్తెను చంపి..

Published : 13 Feb 2022 14:10 IST

గార్లదిన్నె: అనంతరపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో దారుణం జరిగింది. ఓ మహిళ తన మూడు నెలల కుమార్తెను చంపి.. తానూ బలవన్మరణానికి పాల్పడింది. ముందుగా కుమార్తెకు ఉరివేసిన తల్లి.. అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఆమె ఈ దారుణానికి పాల్పడేందుకు కుటుంబ కలహాలు కారణమా?.. లేక భర్త ప్రమేయం ఏమైనా ఉందా?.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  మూడు నెలల పసికందుకు కన్నతల్లే ఉరి వేయడం.. స్థానికులను కలచివేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని