TS News: కోహిర్‌ మండలం దిగ్వాల్‌ వద్ద కారు దగ్ధం

అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లా దిగ్వాల్ వద్ద చోటు

Updated : 13 Aug 2021 04:41 IST

హైదరాబాద్: అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లా దిగ్వాల్ వద్ద చోటు చేసుకుంది. 65వ నెంబరు జాతీయ రహదారిపై జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఇంజిన్‌లో మంటలు వ్యాపించి క్షణాల్లో వాహనమంతా కాలి బూడిదయింది. అప్రమత్తమైన కారు డ్రైవర్ సహా మరో వ్యక్తి కిందకు దిగిపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌కు  చెందిన స్థిరాస్తి వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి జహీరాబాద్ అగ్నిమాపక కేంద్రం ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలు అదుపు చేసే లోపు కారు బుగ్గిపాలయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని