హిరేన్ హత్య: పోలీసు అధికారిపై వేటు!
ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వ్యవహారంలో..వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ మృతిపై దర్యాప్తు జరుపుతోన్న పోలీసు అధికారిపై వేటు వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ మృతిపై దర్యాప్తు జరుపుతోన్న పోలీసు అధికారిపై వేటు వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయనను క్రైం బ్రాంచ్ నుంచి తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రకటించారు. ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తామని మహారాష్ట్ర హోంమంత్రి తెలిపారు.
ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో లభించిన వాహనానికి సంబంధించిన యజమాని మన్సుఖ్ హిరేన్ ఇటీవల అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తోన్న మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్).. హిరేన్ది హత్యేనని ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసు అధికారి సచిన్ వాజేపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. హిరేన్ హత్యలో సచిన్ పాత్ర ఉందని ఆరోపిస్తూ..ఆయనను వెంటనే అరెస్టు చేయాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఈ హత్యలో సచిన్ హస్తం ఉందంటూ హిరేన్ భార్య చేసిన ఫిర్యాదులోనూ పేర్కొంది. ఇలా పోలీసు అధికారి పాత్రపై ఆరోపణలు పెరిగిన నేపథ్యంలో ఆయనను విధులనుంచి తొలగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దక్షిణ ముంబయిలోని అంబానీ ఇంటికి సమీపంలో ఫిబ్రవరి 25న జిలెటిన్ స్టిక్స్తో ఉన్న ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. ఆ వాహనం తనదేపని, అది చోరీకి గురైందని మన్సుఖ్ హరేన్ పోలీసులకు తెలిపారు. దానిపై అంతకుముందే ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఆయన.. థానేలోని సముద్రపు ఒడ్డున శవమై కనిపించారు. ఇది హత్య అని ప్రాథమికంగా తేలడంతో కేసుపై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే