Mumbai: ప్రియుడితో కుమ్మక్కై ..భర్తకు స్లో పాయిజన్
ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భార్య హతమార్చింది. అతడు తినే ఆహారంలో స్లో పాయిజన్ ఇచ్చి పక్కా ప్రణాళిక ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా చంపేసింది.
ముంబయి: వ్యక్తిగత కారణాలతో భర్తతో విడిపోయింది. కానీ, పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టు కొని మళ్లీ వెనక్కి వచ్చినట్టు నటించింది. ఈసారి.. పక్కా ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఈ షాకింగ్ ఘటన ముంబయిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కమల్ కాంత్, కవిత దంపతులు ముంబయిలో నివాసం ఉండేవారు. విడిపోయి తిరిగి వచ్చిన తర్వాత కవిత కుటుంబసభ్యులతో ఎప్పటిలాగేనే ఉండేది. కానీ, తన ప్రియుడు హితేశ్ సాయంతో భర్తను హతమార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వారికి పెట్టే ఆహారంలో స్లో పాయిజన్ కలపడం మొదలు పెట్టింది. దీంతో ఇటీవల కమల్కాంత్ తల్లి ఉదర సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. అయితే, దీనిని అందరూ సాధారణ మరణంగా భావించారు. ఆ తర్వాత నవంబరు 19న తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన కమల్కాంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి రక్తంలో అర్సెనిక్, థాలియం లోహ ధాతువులు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. మానవ రక్తంలోకి ఇలాంటి పదార్థాలు చేరడం అసాధారణమని వైద్యులు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ప్రమాదంగానే భావించినా, ఏదో కుట్రకోణం ఉందన్న అనుమానంతో పోలీసులు కేసును ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు
దర్యాప్తు చేపట్టిన పోలీసులు కమల్ కాంత్ మృతికి అతడి భార్య కవిత, ఆమె ప్రియుడు హితేశ్లే కారణమని నిర్ధరించారు. అతడిని హతమార్చాలనే ఉద్దేశంతోనే పక్కా ప్లాన్ ప్రకారం.. ఎవరికీ అనుమానం రాకుండా స్లో పాయిజన్ను ఆహారంలో కలిపి ఇచ్చారని చెప్పారు. మరోవైపు అతని తల్లి కూడా ఉదర సంబంధిత సమస్యలతోనే మృతి చెందడంతో ఆమె మరణం వెనకకూడా వీళ్ల హస్తం ఉందేమోనన్న అనుమానంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమావేశానికి రాలేదని తెదేపా కార్యకర్త ఇంటిపై వైకాపా కార్యకర్తల దాడి
వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన కుల సంఘ సమావేశానికి రాలేదన్న కారణంతో తెదేపా కార్యకర్త ఇంటి ప్రహరీని ధ్వంసం చేసిన సంఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో చోటుచేసుకుంది. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలోనూ నిందితుడిగా రాహిల్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్పై మరో రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రెండేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి రాహిల్ అని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చి, సెక్షన్లను మార్చి తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. -
హోటల్ దగ్ధం.. నర్సింగ్ విద్యార్థిని సజీవ దహనం
అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు ఎగిసిపడి హోటల్ కాలి యువతి సజీవ దహనమయ్యారు. -
ఎస్సై దాష్టీకాలకు తాళలేక.. చెక్పోస్టు చిరుద్యోగి ఆత్మహత్య
ఎస్సై ఒత్తిళ్లు, వేధింపులకు తాళలేక ఓ చిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న దారుణమిది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని గుండ్లపాలేనికి చెందిన పోకూరి సురేష్బాబు(38) వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలోని తెట్టు చెక్పోస్టులో అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
కబడ్డీ నేర్పిస్తామని నమ్మించి ఎస్సీ బాలికపై అత్యాచారం
కబడ్డీ ఆటలో మెలకువలు చెబుతామంటే నమ్మి వారి వద్దకు వెళ్లిన ఓ ఎస్సీ బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
విద్యాదీవెన డబ్బులు రాక.. కుమార్తె హాల్టికెట్ కోసం తల్లి ఆత్మహత్యాయత్నం
జగనన్న విద్యాదీవెన నగదు రాకపోవడం ఓ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. -
సిద్ధం సభకు రాయితో వచ్చిన వైకాపా కార్యకర్త
కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం నిర్వహించిన సిద్ధం సభకు వైకాపా కార్యకర్త ఒకరు రాయితో రావడం కలకలం సృష్టించింది. -
అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థి మృతి
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రశాంత్(12) మంగళవారం రాత్రి మృతిచెందాడు. -
పరీక్షలకు అనుమతించలేదని... ఆర్జీయూకేటీలో విద్యార్థి బలవన్మరణం
పరీక్షలకు అనుమతించలేదనే బాధతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం బాసర ఆర్జీయూకేటీలో కలకలం సృష్టించింది. -
దద్దరిల్లిన బస్తర్
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతం కాల్పులతో మారుమోగింది.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘటన..బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యం
-
మూడు నెలల్లో భారాస దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాల రద్దు
-
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
-
రాయి దాడి కేసు.. బీసీ యువకులను బెదిరిస్తున్నారు: కేశినేని చిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM