Mumbai Murder: దుర్వాసన వస్తుంటే.. స్ప్రేకొట్టి తలుపుతీశాడు: ముంబయి హత్యను గుర్తించారిలా..!
Mumbai Murder:సహజీవన భాగస్వామిని హత్య చేసి, ముక్కలుగా చేసిన ఘటనలో మృతురాలికి చెందిన శరీర భాగాలు కొన్ని మిస్ అయినట్లు, వాటిని నిందితుడు వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ముంబయి: వాణిజ్య రాజధాని ముంబయిలో జరిగిన శ్రద్ధా వాకర్(Shraddha Walkar) తరహా ఘటన స్థానికుల వల్ల వెలుగులోకి వచ్చింది. దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై స్థానిక వ్యక్తులు కొందరు మీడియాతో మాట్లాడారు.( Mumbai Murder)
56 ఏళ్ల మనోజ్ సహానీ, 32 ఏళ్ల సరస్వతి వైద్య సహజీవన భాగస్వాములు. మూడు సంవత్సరాలుగా ముంబయి మీరారోడ్డులోని ఆకాశ్గంగా అపార్ట్మెంట్లో ఏడో అంతస్తులో అద్దెకుంటున్నారు. అయితే బుధవారం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. ‘వాసన రావడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు వారింటికి వెళ్లాను. కానీ ఎవరూ తలుపు తీయలేదు. ఆ తర్వాత స్ప్రే కొట్టిన శబ్దం వినిపించింది. అనంతరం మనోజ్ వచ్చి తలుపు తీశాడు. వెంటనే దీనిపై అపార్ట్మెంట్ నిర్వాహకులకు సమాచారమిచ్చాను. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫ్లాట్లోకి వెళ్లగా.. రెండు కట్టర్లను గుర్తించారు. అందులో ఒక ఎలక్ట్రిక్ కట్టర్ కూడా ఉంది. అలాగే కిచెన్లో శరీర భాగాలు వేసిన మూడు బకెట్ల కనిపించాయి’అని సహానీ ఫ్లాట్కు పొరుగున నివసించే వ్యక్తి ఒకరు వెల్లడించారు.
ఆ కట్టర్లను, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమె శరీర భాగాలు కొన్నింటిని అతడు నగరంలోని పలు ప్రాంతాల్లో వేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ గదిలో నుంచి భరించలేని స్థాయిలో దుర్వాసన వస్తుండటంలో అక్కడ శోధించడం కష్టంగా మారిందని చెప్పారు. మనోజ్, సరస్వతి.. పొరుగువారితో ఎక్కువగా మాట్లాడరని తెలుస్తోంది. అలాగే ఆమె అనాథ అని గుర్తించారు. ఓ రేషన్ షాపులో పరిచయమైన వీరిద్దరూ.. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా