Andhra News: పల్నాడులో దారుణం.. యువతి గొంతు కోసిన యువకుడు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తులసీరామ్‌ అనే యువకుడు సత్తెనపల్లిలో యువతి గొంతు కోశాడు. గత కొంత కాలంగా తులసీరామ్‌ యువతితో సహజీవనం చేస్తున్నాడు. తన ప్రవర్తనపై అనుమానంతో తులసీరామ్‌ యువతి...

Updated : 14 Apr 2022 19:16 IST

సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో యువతి గొంతు కోసిన ఘటన జిల్లాలోని సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. సీఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. దాచేపల్లికి చెందిన షేక్‌ ఫాతిమా భర్తతో విడిపోయి గత 6 నెలల నుంచి సత్తెనపల్లిలోని పాత బస్టాండు ప్రాంతంలో జనసేన కార్యాలయం ఎదురుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. కొంత కాలంగా మాచర్లకు చెందిన తులసీరామ్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా తాలూకా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని జనసేన నాయకులు పార్టీ కార్యాలయానికి వస్తుండగా రోడ్డుపై రక్తపు మడుగులో పడిఉన్న ఫాతిమాను గమనించారు. వెంటనే స్పందించిన జనసేన నాయకులు ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులకు సమాచారం అందజేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఫాతిమాను సత్తెనపల్లి నుంచి గుంటూరు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఫాతిమా గొంతును తులసీరామ్‌ కోశాడా.. లేదా వారిద్దరి మధ్య మనస్పర్థలలో ఆమే ఆత్మహత్యాయత్నం చేసిందా.. అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉండటంతో పూర్తి వివరాలు తెలియలేదన్నారు. ప్రస్తుతం తులసీరామ్‌ పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని