Andhra News: బద్వేల్‌లో తండ్రి, కుమారుడిపై హత్యాయత్నం

వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌లో తండ్రి, కుమారుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శేషారెడ్డితో పాటు ఆయన కుమారుడిపై

Published : 17 Aug 2022 12:50 IST

బద్వేల్‌: వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌లో తండ్రి, కుమారుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శేషారెడ్డితో పాటు ఆయన కుమారుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బద్వేల్‌ పోలీసులు తెలిపారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని