Crime News: తల విరాట్నగర్లో..మొండెం తుర్కయాంజల్లో..
నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన జైహింద్ నాయక్ (30) అనే మతి స్థిమితం లేని వ్యక్తి దారుణహత్య కేసులో మొండెం లభ్యమైంది...
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన జైహింద్ నాయక్ (30) అనే మతి స్థిమితం లేని వ్యక్తి దారుణహత్య కేసులో మొండెం లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లోని ఓ భవనంపై జైహింద్ నాయక్ మొండెం గుర్తించారు. మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్, హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే విరాట్నగర్ కాలనీలో మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద .. దుండగులు మొండెం లేని తలను ఉంచారు. డీఎస్పీ ఆనంద్రెడ్డి ఆధ్వర్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తల ఫొటో ఆధారంగా మృతుడు జైహింద్ నాయక్ అని గుర్తించారు. అతడిది సూర్యాపేట జిల్లా పాకలవీడు మండలం శూన్యపహాడ్ గ్రామం అని నిర్ధారించారు. దారుణహత్యను గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారా? మరేదైనా కారణముందా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కేసు మిస్టరీని చేధించేందుకు 8 పోలీసు బృందాలను నియమించారు.
హతుడికి మతిస్థిమితం లేకపోవడం, సెల్ఫోన్ ఉపయోగించకపోవడం, చివరిసారిగా అతడిని చూసినవారు లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ హత్యకేసులో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఆశించినంతగా పురోగతి లేదు. మరోవైపు తల దొరికిన విరాట్నగర్లోని మహంకాళీ అమ్మవారి దేవాలయాన్ని బుధవారం నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించి విచారణ జరుగుతున్న తీరును సీసీఎస్ డీఎస్పీ మొగులయ్యని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ - సాగర్ రహదారిపై రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ నుంచి కొండమల్లేపల్లి వరకు సుమారు 80 కి.మీ. వరకు ప్రతి సెంటర్లోని సీసీ కెమెరాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. మరోవైపు తుర్కయాంజల్లో జైహింద్ నాయక్ గత కొన్నాళ్లుగా ఉంటున్న ప్రదేశంలోని ప్రతి ఒక్కరిని పోలీసులు ప్రశ్నించారు. ఈక్రమంలో ఓ భవనంపై జైహింద్ నాయక్ మొండెం లభ్యమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు