Murder: హైదరాబాద్‌లో రూ. 2వేల కోసం స్నేహితుడి గొంతు కోసి హత్య 

నగరంలో దారుణ హత్య చోటుచేసుకుంది. రూ.2 వేల కోసం స్నేహితుడనే కనికరం లేకుండా ఓ యువకుడు గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. 

Published : 12 Nov 2021 02:06 IST

హైదరాబాద్‌: నగరంలో దారుణ హత్య చోటుచేసుకుంది. రూ.2 వేల కోసం స్నేహితుడనే కనికరం లేకుండా ఓ యువకుడు గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ముషీరాబాద్‌లోని ఫకిర్‌వాడలో గురువారం రాత్రి జరిగింది. ఫకిర్‌వాడలో నివాసముండే అల్తాఫ్‌ఖాన్‌ తన స్నేహితుడు సోనుకు గతంలో రూ.2 వేలు ఇచ్చాడు. అయితే తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో అల్తాఫ్‌ఖాన్‌ కోపంతో సోనును గొంతుకోసి హత్యచేశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని