Kurnool: కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ప్రధాన అనుచరుడు సిద్ధప్ప దారుణ హత్య
కర్నూలు జిల్లా కోడుమూరులో ఫ్యాక్షన్ పడగ విప్పింది. కేంద్ర మాజీ మంత్రి, తెదేపా నేత కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ప్రధాన అనుచరుడు సిద్ధప్ప దారుణహత్యకు గురయ్యారు.
కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరులో ఫ్యాక్షన్ పడగ విప్పింది. కేంద్ర మాజీ మంత్రి, తెదేపా నేత కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ప్రధాన అనుచరుడు సిద్ధప్ప దారుణహత్యకు గురయ్యారు. గోనెగండ్ల మండలం కున్నూరుకు చెందిన ఆయన.. కోడుమూరులో తన అనుచరులతో ఉండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే సిద్ధప్పపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
2008లో దారుణహత్యకు గురైన తెదేపా నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కేసుతో పాటు కున్నూరు గ్రామంలో జరిగిన మూడు హత్యల్లో సిద్ధప్ప నిందితుడిగా ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన కున్నూరు గ్రామాన్ని విడిచి కోడుమూరులో తలదాచుకుంటున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోడుమూరు ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్